: రాజ్యాంగం ప్రామాణిక గ్రంధం : వీఎస్యూ వీసీ
ABN , First Publish Date - 2021-01-27T03:00:07+05:30 IST
మన రాజ్యాంగం ప్రామాణిక గ్రంధమని వీఎస్యూ వీసీ రొక్కం సుదర్శనరావు పేర్కొన్నారు. కాకుటూరు వద్ద ఉన్న వీఎస్యూ
వెంకటాచలం, జనవరి 26 : మన రాజ్యాంగం ప్రామాణిక గ్రంధమని వీఎస్యూ వీసీ రొక్కం సుదర్శనరావు పేర్కొన్నారు. కాకుటూరు వద్ద ఉన్న వీఎస్యూలో మంగళవారం గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ఈసందర్భంగా వీసీ జాతీయ జెండాను ఎగురవేసి ఎన్సీసీ విద్యార్ధుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీల కన్నా అన్నింటిలో వీఎస్యూ ముందు ఉండాలన్నదే తన అభిమతమన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ఎం చంద్రయ్య, రిజిస్ర్టార్ డాక్టర్ లేబాకు విజయకృష్ణారెడ్డి, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ సుజాఎస్ నాయర్ తదితరులు పాల్గొన్నారు.