పదకొండవ రోజు మహాపాదయాత్రపై పోలీసుల ఆంక్షలు

ABN , First Publish Date - 2021-11-11T13:10:24+05:30 IST

పదకొండవ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్రపై పోలీసుల ఆంక్షలు విధించారు. పాదయాత్రలో పాల్గొనకుండా ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలను ముందస్తుగా

పదకొండవ రోజు మహాపాదయాత్రపై పోలీసుల ఆంక్షలు

ప్రకాశం: పదకొండవ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్రపై పోలీసుల ఆంక్షలు విధించారు. పాదయాత్రలో పాల్గొనకుండా  ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలను ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. చిలకలూరిపేటలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. మార్టూరులో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును హౌస్ అరెస్ట్ చేశారు. ఒంగోలులో సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లా టీడీపీ నేతల కదళికలపై పోలీసులు యంత్రాంగం నిఘా ఉంచింది. పాదయాత్ర ప్రారంభమయ్యే నాగులుప్పలపాడుకు వచ్చే అన్నీ రహదారుల వద్ద పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-11-11T13:10:24+05:30 IST