రేపు ప్రకాశం బ్యారేజ్కి రానున్న భారీ వరద నీరు
ABN , First Publish Date - 2021-07-31T20:54:04+05:30 IST
రేపు ప్రకాశం బ్యారేజ్కి రానున్న భారీ వరద నీరు
విజయవాడ: రేపు ప్రకాశం బ్యారేజ్కి రానున్న భారీ వరద నీరు చేరనుంది. దాంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోవడంతో వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పులిచింతల ప్రాజెక్ట్ నిండిపోయింది. జగ్గయ్యపేట నుంచి అవనిగడ్డ వరకు నదీ పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ నివాస్ తెలిపారు. కృష్ణా నదీ వరదలపై కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్ సమీక్ష నిర్వహించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. రేపు మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి బ్యారేజీకి సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలతోపాటు లంకల్లో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు.