ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2021-10-26T13:30:30+05:30 IST
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వెంకటాపురం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది.
ఒంగోలు: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వెంకటాపురం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని శ్రీ కృష్ణ ట్రావెల్స్కు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుండి కందుకూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.