Prakasam: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి... భర్త పరిస్థితి విషమం

ABN , First Publish Date - 2022-06-03T14:13:14+05:30 IST

జిల్లాలోని మార్కాపురం మండలం తిప్పాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

Prakasam: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి... భర్త పరిస్థితి విషమం

ప్రకాశం: జిల్లాలోని మార్కాపురం మండలం తిప్పాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జాతీయ రహదారి దాటుతున్న దంపతుల ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. భార్య రమణమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. భర్త వెంకటరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. మార్కాపురం మండలం మాల్యవంతునిపాడు నుంచి ఉపాధిహామీ పనికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-03T14:13:14+05:30 IST