AP: మినీట్రక్ డోర్ విరిగి నలుగురు మృతి

ABN , First Publish Date - 2021-08-25T14:00:29+05:30 IST

ప్రకాశం జిల్లా తర్లుబాడు మండలం కలజువ్వలపాడులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

AP: మినీట్రక్ డోర్ విరిగి నలుగురు మృతి

ఒంగోలు:  ప్రకాశం జిల్లా తర్లుబాడు మండలం కలజువ్వలపాడులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మినీ ట్రక్‌లో వెళ్తుండగా డోరు విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దారవీడు మండలం సోమేపల్లి నుండి పొదిలి మండలం అక్కచెరువుకు పెళ్లి కుమార్తెను తీసుకుని వివాహానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో వివాహం నిలిచిపోయింది. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతులు కనకం కార్తీక్ (14), కనకం అనిల్( 12), బోగోలు సుబ్బారావు (40), కొంగరి శ్రీనివాసులు (50)గా గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Updated Date - 2021-08-25T14:00:29+05:30 IST