ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గృహనిర్బంధం..ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-10-20T17:14:29+05:30 IST

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నాగులపాలెంలో ఉద్రికత్త చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును పోలీసులు గృహనిర్బంధం చేశారు.

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గృహనిర్బంధం..ఉద్రిక్తత

ఒంగోలు: ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నాగులపాలెంలో ఉద్రికత్త చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీంతో పోలీసులతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే ఏలూరిని  టీడీపీ శ్రేణులు పర్చూరు బొమ్మల సెంటర్ వద్దకు ర్యాలీగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘన నివాళ్ళుర్పించారు. సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీడీపీ కార్యకర్తలు...సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. 

Updated Date - 2021-10-20T17:14:29+05:30 IST