నేటి నుంచి మార్కాపురంలో యథావిధిగా కూరగాయల విక్రయాలు
ABN , First Publish Date - 2020-07-06T13:00:51+05:30 IST
నేటి నుంచి మార్కాపురంలో యథావిధిగా కూరగాయల విక్రయాలు
ఒంగోలు, మార్కాపురం: పట్టణంలో సోమవారం నుంచి కూరగాయల విక్రయాలు యథావిధిగా జరుగనున్నాయి. స్థానిక మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన కూరగాయల వ్యాపారులను పోలీస్ అధికారి దుర్భాషలాడాడన్న కారణంతో 12 రోజుల పాటు పట్టణంలో కూరగాయల విక్రయాలు నిలిపివేయాలని పట్టణ కూరగాయల అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మార్కాపురం శాసనసభ్యుడు కుందురు నాగార్జునరెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు కూరగాయల మార్కెట్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. దీంతో సోమవారం నుంచి యథావిధిగా కూరగాయల విక్రయాలు చేపట్టాలని నిర్ణయించారు. వారంలో సోమ, మంగళ, గురు, శుక్రవారాలు మాత్రమే కూరగాయలు విక్రయించనున్నారు. పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు విక్రయాలను ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే చేయనున్నారు.