Prakasam జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో విజృంభిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2021-08-27T13:16:17+05:30 IST

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా విజృంభిస్తోంది. రెండు పాఠశాలల్లో ఒకేరోజు తొమ్మిది కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Prakasam జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో విజృంభిస్తున్న కరోనా

ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో  కరోనా విజృంభిస్తోంది. రెండు పాఠశాలల్లో ఒకేరోజు తొమ్మిది కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఉలవపాడు మండలం వీరేపల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో నలుగురు విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే వెలిగండ్ల మండలం వెదుల్లచెరువు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇప్పటికే ఒంగోలు పీవీఆర్ బాలికల హైస్కూల్‌లో ముగ్గురు విద్యార్థినిలు కరోనా బారిన పడ్డారు. అటు డీఆర్ఎం మున్సిపల్ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడితో సహా నలుగురు ఉపాధ్యాయులు, ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నమోదు అయ్యింది. దర్శి మండలం నిమ్మారెడ్డిపాలెం ప్రభుత్వం పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలికి కరోనా సోకింది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వైద్య సిబ్బంది ర్యాండంగా టెస్టులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పాఠశాలల్లో కరోనా బాధితుల సంఖ్య 22కు చేరింది. పాఠశాలలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ ఒకేసారి పరీక్షలు నిర్వహిస్తే భారీగా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. పాఠశాలలకు వస్తున్న పలువురు విద్యార్థులకు జ్వర లక్షణాలు ఉండటంతో వారికి పరీక్షలు చేయకుండానే సిబ్బందివెనక్కు పంపుతున్నారు. పాఠశాలల్లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో ఇతర ఉపాద్యాయులు, విద్యార్థుల ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-08-27T13:16:17+05:30 IST