AP: వైసీపీ ఎమ్మెల్యే పర్యటనతో ట్రాఫిక్ జామ్.. చిక్కుకున్న అంబులెన్స్‌లు

ABN , First Publish Date - 2022-05-08T21:46:04+05:30 IST

ప్రకాశం జిల్లా: కల్యాణదుర్గం చిన్నారి మృతి ఘటన తర్వాత కూడా వైసీపీ నేతలు తీరు మార్చుకోవడంలేదు.

AP: వైసీపీ ఎమ్మెల్యే పర్యటనతో ట్రాఫిక్ జామ్.. చిక్కుకున్న అంబులెన్స్‌లు

ప్రకాశం జిల్లా: కల్యాణదుర్గం చిన్నారి మృతి ఘటన తర్వాత కూడా వైసీపీ నేతలు తీరు మార్చుకోవడంలేదు. అధికార పార్టీ నేతల పర్యటనలతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఒంగోలులో ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యటనతో ట్రాఫిక్ జామ్ అయింది. అదే సమయంలో అంబులెన్సులు ట్రిఫిక్‌లో చిక్కుకున్నాయి. దీంతో పాటు ఓ మినీవ్యాన్ నడిరోడ్డుపై ఆగిపోయింది. ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు కలిసి వాహనాన్ని నెట్టి అంబులెన్సులకు దారిచ్చారు.


ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్ సెంటర్‌లో ఓ ప్రైవేటు మెడికల్ షాపు ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే బాలినేని వచ్చారు. ఆయన వెంట వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా వాహనాలతో తరలి వచ్చారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో నడిరోడ్డుపై మినీ వ్యాన్ నిలిచిపోయింది. దాని వెనుక రోగులను తీసుకువెళుతున్న రెండు అంబులెన్సులు ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాయి. 15 నిముషాలైనా ఎవరూ పట్టించుకోకపోవడంతో స్పందించిన స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు మినీ వ్యాన్‌ను పక్కకు నెట్టి అంబులెన్సులకు దారిచ్చారు. 

Read more