Prakasam: భార్య, కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

ABN , First Publish Date - 2021-08-16T17:47:01+05:30 IST

కందుకూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. భర్త శ్రీనివాసులు గత కొన్ని రోజులుగా భార్య, కూతురిపై అనుమానం పెంచుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి భర్త ...

Prakasam: భార్య, కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

ప్రకాశం: కందుకూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. భర్త శ్రీనివాసులు గత కొన్ని రోజులుగా భార్య, కూతురిపై అనుమానం పెంచుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి భర్త శ్రీనివాసులు బాగా తాగి వచ్చి భార్య, కూతురితో గొడవపడ్డాడు. అనంతరం ఇద్దరిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన మాచవరం రెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. స్థానికులు తల్లి, బిడ్డను స్థానిక ఆస్పత్రి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కుమార్తె ప్రియాంక మృతి చెందగా..భార్య సుశీల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-08-16T17:47:01+05:30 IST