Prakasam: కౌలు రైతు దంపతుల ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-08-02T13:15:15+05:30 IST
జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి కౌలు రైతు దంపతులు ఆంజనేయులు(62), ఫణీంద్ర(55) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జె. పంగులూరు మండలంలోని చందలూరు...
ప్రకాశం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి కౌలు రైతు దంపతులు ఆంజనేయులు(62), ఫణీంద్ర(55) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జె. పంగులూరు మండలంలోని చందలూరు గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబకలహాల వల్ల దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.