పోలింగ్ బూత్ల వద్ద కాన్వాయ్తో YCP ఎమ్మెల్యే హల్చల్
ABN , First Publish Date - 2021-11-15T16:34:27+05:30 IST
ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పోలింగ్ బూత్ వద్ద కాన్వాయ్తో తిరుగుతూ హల్చల్ చేశారు.
ఒంగోలు: రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్ బూత్ల వద్ద ప్రచారాలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదే క్రమంలో ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పోలింగ్ బూత్ వద్ద కాన్వాయ్తో తిరుగుతూ హల్చల్ చేశారు.
దీనిపై ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నూకసాని బాలాజీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేపై రిటర్నింగ్ అధికారి జేసీ కృష్ణవేణికి ఫిర్యాదు చేశారు. దర్శిలో దొంగ ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున స్థానికేతరులను వైసీపీ తరలించిందంటూ ఆరోపించారు. పోలింగ్ బూతుల వద్ద వైసీపీ ఎమ్మెల్యే హడావుడి చేస్తూ దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ నూకసాని బాలాజీ ఆందోళన వ్యక్తం చేశారు.