ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి

ABN , First Publish Date - 2020-09-20T12:12:34+05:30 IST

ప్రకాశం జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 1065 కేసులు నమోదు అయ్యాయి.

ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 1065 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41,505కి చేరింది. ఒంగోలులో అత్యధికంగా 220 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి నలుగురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో  416 మంది మృతి చెందారు. నిన్న కరోనా నుండి కోలుకుని 75 మంది డిశ్చార్జ్ అయ్యారు. 60 మందిని హోం ఐసోలేషన్‌కు పంపారు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Updated Date - 2020-09-20T12:12:34+05:30 IST