ప్రకాశం జిల్లాలో 1132కు చేరిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-08T11:58:13+05:30 IST

ప్రకాశం జిల్లాలో 1132కు చేరిన కరోనా కేసులు

ప్రకాశం జిల్లాలో 1132కు చేరిన కరోనా కేసులు

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 52 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1132గా ఉంది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిని పడి 21 మంది మృత్యువాతపడ్డారు. మరోవైపు ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం  90,897 శ్యాంపిళ్లు పంపగా... 88,490 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఇంకా 2407 రిపోర్టులు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్లలో  685 ఉన్నారు. నిన్న కరోనా నుండి కోలుకుని 150 మంది డిశ్చార్జ్ అవగా... ఇప్పటి వరకు కరోనా బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 607కి చేరింది. అలాగే జిల్లాలో ప్రస్తుతం 525 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Updated Date - 2020-07-08T11:58:13+05:30 IST