ప్రకాశం జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-07-01T11:43:13+05:30 IST

ప్రకాశం జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

ప్రకాశం జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

ప్రకాశం: జిల్లాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా మరో 33 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు 663 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒంగోలులో 14, మార్కాపురంలో 12 అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 11 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 80,641 శ్యాంపిళ్లు పంపగా 76,153 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఇంకా 3867 రిపోర్టులు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా  525 మంది క్వారంటైన్లలో ఉన్నారు. ఇప్పటి వరకు కరోనా బారి నుండి కోలుకుని 262 మండి డిశ్చార్జ్ అవగా... జిల్లాలో ప్రస్తుతం 401 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Updated Date - 2020-07-01T11:43:13+05:30 IST