ప్రకాశం జిల్లాలో కరోనా కట్టడికి కఠినంగా ఆంక్షలు

ABN , First Publish Date - 2021-04-22T01:37:53+05:30 IST

ప్రకాశం జిల్లాలో కరోనా కట్టడికి కఠినంగా ఆంక్షలు

ప్రకాశం జిల్లాలో కరోనా కట్టడికి కఠినంగా ఆంక్షలు

ప్రకాశం: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులు పెరుగుతున్న 19 ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఒంగోలు, కందుకూరు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరుతో పాటూ మండల కేంద్రాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. ఎల్లుండి నుంచి జిల్లాలోని 19  ప్రాంతాల్లో 10 రోజుల పాటు ఆంక్షలు విధించే అవకాశం ఉందన్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకూ, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల కొనుగోళ్లుకు అనుమతిస్తున్నట్లు కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. 


Updated Date - 2021-04-22T01:37:53+05:30 IST