ప్రకాశం జిల్లాలో 39333కు చేరిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-09-17T12:26:42+05:30 IST

ప్రకాశం జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 615 కేసులు నమోదు అయ్యాయి.

ప్రకాశం జిల్లాలో 39333కు చేరిన కరోనా కేసులు

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 615 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 39,333కు చేరింది. ఒంగోలులో అత్యధికంగా 159 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి నలుగురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 399 మంది మృతి చెందారు. నిన్న కరోనా నుండి కోలుకుని 63 మంది డిశ్చార్జ్ అయ్యారు. 60 మందిని హోం ఐసోలేషన్‌కు పంపారు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 13,312 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Updated Date - 2020-09-17T12:26:42+05:30 IST