ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న వరద ఉధృతి

ABN , First Publish Date - 2021-07-23T22:18:54+05:30 IST

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో లక్షా ఐదు వేల క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో లక్ష క్యూసెక్కులుగా ఉంది.

ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న వరద ఉధృతి

ప్రకాశం: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద  ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో లక్షా ఐదు వేల క్యూసెక్కులు కాగా..  అవుట్ ఫ్లో లక్ష క్యూసెక్కులుగా ఉంది. శుక్రవారం రాత్రికి  లక్షా పాతిక వేల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పట్టిసీమ నుంచి 15,000, పులిచింతల నుంచి 15,000,  మున్నేరు నుంచి లక్ష క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరుకుంటుండడంతో నదీ పరీవాహక ప్రాంత రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు.

Updated Date - 2021-07-23T22:18:54+05:30 IST