Ongole: ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి

ABN , First Publish Date - 2022-02-28T13:48:00+05:30 IST

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎం.నిడమానూరులో విషాదం చోటు చేసుకుంది.

Ongole: ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి

ఒంగోలు: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎం.నిడమానూరులో విషాదం చోటు చేసుకుంది. గ్రామ శివారులో ఉన్న వాగులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. నిన్న సాయంత్రం  విద్యార్థులు వాసు(15), మహేష్(13), జగన్(12) కనిపించకుండా పోయారు. ఈతకు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు గజఈతగాళ్ల సాయంతో వాగులో గాలింపు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. విద్యార్థుల మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 


Updated Date - 2022-02-28T13:48:00+05:30 IST