Ongole: సముద్రతీరానికి కొట్టుకొచ్చిన విద్యార్థుల మృతదేహాలు

ABN , First Publish Date - 2022-02-19T14:09:01+05:30 IST

ప్రకాశం జిల్లా చీరాల మండలం రామాపురం సముద్ర తీరానికి విద్యార్థుల మృతదేహాలు కొట్టుకొచ్చాయి.

Ongole: సముద్రతీరానికి కొట్టుకొచ్చిన విద్యార్థుల మృతదేహాలు

ఒంగోలు: ప్రకాశం జిల్లా చీరాల మండలం రామాపురం సముద్ర తీరానికి విద్యార్థుల మృతదేహాలు కొట్టుకొచ్చాయి. నిన్న చీరాల మండలం వాడరేవు వద్ద  ఇంటర్ విద్యార్దులు షేక్.ఆఫ్రిది(18), వెంకట మారుతి(18) అనే ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. విషయం తెలిసిన పోలీసులు... గజ ఈతగాళ్లతో విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఈరోజు ఉదయం విద్యార్థులు మృతదేహాలు సముద్రతీరానికి కొట్టుకువచ్చాయి. విద్యార్థుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2022-02-19T14:09:01+05:30 IST