ఒంగోలు: తల్లీకూతుళ్ల హత్య కేసును చేధించిన పోలీసులు
ABN , First Publish Date - 2022-02-05T17:01:40+05:30 IST
ప్రకాశం జిల్లాలో టంగుటూరులో డిసెంబర్ 3న జరిగిన తల్లీకూతుళ్లు శ్రీదేవి, వెంకట లేఖన హత్య కేసును పోలీసులు చేధించారు.
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో టంగుటూరులో డిసెంబర్ 3న జరిగిన తల్లీకూతుళ్లు శ్రీదేవి, వెంకట లేఖన హత్య కేసును పోలీసులు చేధించారు. ఇద్దరు పాత నేరస్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బంగారు ఆభరణాల కోసం తల్లీకూతుళ్లను హత్య చేసినట్లు తెలుస్తోంది.