ఒంగోలు: ప్రకాశం జిల్లా పర్చూరు సమీపంలో టాటా అల్ట్రాటెక్ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మధు వాహనం క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని డ్రైవర్ను బయటకు తీసి హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి నిద్రమత్తే కారణమని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.