ప్రకాశం జిల్లాలో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-04-19T16:37:25+05:30 IST

జిల్లాలోని కంభం మండలం రావిపాడులో పాలగిరి రామ్మూర్తి అనే రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రకాశం జిల్లాలో రైతు ఆత్మహత్య

ప్రకాశం: జిల్లాలోని కంభం మండలం రావిపాడులో పాలగిరి రామ్మూర్తి అనే రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తాళలేక రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రామ్మూర్తి స్వగ్రామం పొదిలి మండలం కాటువారి పాలెం. కంభం మండలం రావిపాడులోని బంధువుల ఇంటికి వచ్చిన రామ్మూర్తి ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-04-19T16:37:25+05:30 IST