ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి

ABN , First Publish Date - 2020-07-16T12:51:17+05:30 IST

ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి

ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 124 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1957గా ఉంది. అత్యధికంగా ఒంగోలులో 28, మార్కాపురంలో 28 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లాలో ఇప్పటి వరకు 32 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. 


ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 1,05,058 శ్యాంపిళ్లు పంపగా... అందులో 95,570 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఇంకా 7531 రిపోర్టులు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్లలో 482 మంది ఉండగా... నిన్న కరోనా నుండి కోలుకుని 62 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1311కి చేరింది. అలాగే జిల్లాలో ప్రస్తుతం 646 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Updated Date - 2020-07-16T12:51:17+05:30 IST