ప్రకాశం: మోడల్స్కూళ్ల అడ్మిషన్లకు షెడ్యూలు విడుదల
ABN , First Publish Date - 2020-07-16T12:45:56+05:30 IST
ప్రకాశం: మోడల్స్కూళ్ల అడ్మిషన్లకు షెడ్యూలు విడుదల
ఒంగోలు: జిల్లాలోని ఏపీ మోడల్ స్కూళ్ళలో 2020-21 విద్యా సంవత్సరంలో ఇంటర్ అడ్మిషన్లకు షెడ్యూలు విడుదలైందని డీఈవో వీఎస్.సుబ్బారావు బుధవారం తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 16 నుంచి 31 వరకు ఆన్లైన్లో ద రఖాస్తు చేసుకోవాలి. ఈనెల 30లోపు రిజిష్ట్రేన్ ఫీజు ఓసీ, బీ సీ లు రూ.150, ఎస్సీ,ఎస్టీలు రూ.100 చెల్లించాలి. ఆగస్టు 1న వచ్చిన దరఖాస్తులు జాబితాను ప్రకటించి అదేరోజు ఎంపికైన విద్యార్థు లను ప్రకటిస్తారన్నారు. ఆగస్టు 3న సర్టిఫికెట్ల పరిశీలన, అనంత రం తరగతులు ప్రారంభిస్తారు. సీట్లు కేటాయింపులో అన్ని వర్గాల్లో 33.33శాతం సీట్లు బాలికలకు కేటాయిస్తారని చెప్పారు.