ప్రకాశం జిల్లాను వణికిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-07-09T13:48:55+05:30 IST

ప్రకాశం జిల్లాను వణికిస్తున్న కరోనా

ప్రకాశం జిల్లాను వణికిస్తున్న కరోనా

ఒంగోలు:  ప్రకాశం జిల్లాను కరోనా వైరస్ వణికిస్తోంది. తాజాగా మరో 110 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1196కు చేరింది. నిన్న అత్యధికంగా ఒంగోలులో 34, మార్కాపురం 17, పామూరు 13 సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న కరోనాతో ఓ వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగి సహా ముగ్గురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 24 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 94,284 శ్యాంపిళ్లు పంపారు. వాటిలో 88,510 నెగిటివ్ ఫలితాలు రాగా...ఇంకా 4691 రిపోర్టులు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 705 మంది క్వారంటైన్లలో ఉన్నారు. ఇప్పటి వరకు కరోనా బారి నుండి కోలుకుని 607 మంది  డిశ్చార్జ్ అవగా...జిల్లాలో ప్రస్తుతం 589 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Updated Date - 2020-07-09T13:48:55+05:30 IST