KA Paul: బ్యాలెట్ విధానంలో ఎన్నికలు పెట్టాలి...లేదంటే : కేఏ పాల్‌

ABN , First Publish Date - 2022-07-26T17:47:41+05:30 IST

దేశంలో ప్రజాస్వామ్యం చనిపోతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ అన్నారు.

KA Paul: బ్యాలెట్ విధానంలో ఎన్నికలు పెట్టాలి...లేదంటే : కేఏ పాల్‌

విజయవాడ: దేశంలో ప్రజాస్వామ్యం చనిపోతుందని ప్రజాశాంతి పార్టీ (Prajashanti party) అధ్యక్షులు కేఏపాల్ (KA Paul) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ...  దేశంలో బ్యాలెట్ విధానంలో ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈవీఏంలు ఉంటే మళ్లీ బీజేపీ(BJP)దే అధికారం అని చెప్పుకొచ్చారు. ప్రజాశాంతి‌పార్టీలో చేరేందుకు ఐఎఎస్‌లు, ఐపీఎస్‌లు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. దేశం ఆర్ధిక వ్యవస్థ ప్రమాదంలో ఉందని కేఏ పాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-07-26T17:47:41+05:30 IST