Guntur: తెలంగాణలో నేను.. ఏపీలో పవన్ను సీఎం చేస్తా : కేఏ పాల్
ABN , First Publish Date - 2022-07-31T02:06:35+05:30 IST
చంద్రబాబు (Chandrababu), జగన్ (Jagan), పవన్ (Pawan) కంటే ప్రజల సపోర్ట్ తనకే ఎక్కువ ఉందని...
గుంటూరు (Guntur): చంద్రబాబు (Chandrababu), జగన్ (Jagan), పవన్ (Pawan) కంటే ప్రజల సపోర్ట్ తనకే ఎక్కువ ఉందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ (Prajashanthi party chief Ka Paul) అన్నారు. ప్రజలు తననే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ (Cm Kcr).. ఆంధ్రాలో జగన్ కలిసి పయనిస్తే అభివృద్ధి ఉండేదని.. కాని కలిసి నడవడానికి వారు ససేమిరా అంటున్నారని కేఏ పాల్ చెప్పారు. తెలంగాణలో తనపై దాడి జరగడంతో రాజకీయ చిత్రం మారిపోయిందని పేర్కొన్నారు. ఒక్క దెబ్బతో 30 లక్షల ఓటర్లు తనకు పెరిగారయన్నారు.
‘‘ దేశంలో శ్రీలంక (Srilanka) పరిస్థితులు రాక ముందే మోదీని గద్జెదించాలి. కేసీఆర్ను చిత్తుగా ఓడించాలి. తెలంగాణ నుంచి పోటీ చేస్తా. జగన్కు నేను జీవితంలో సపోర్ట్ చేయను. కేసీఆర్కు కళ్లు నెత్తి మీదకు వచ్చాయి. కాబోయే తెలంగాణ సీఎంను నేనే. స్పెషల్ ప్యాకేజ్, స్టేటస్ కేంద్రం ఏపీకి ఇవ్వడం లేదు. నేనే పీఎం అయితే తెలుగు రాష్ట్రాలకు మహర్దశ. జగన్ మూడు సంవత్సరాల్లో అప్పులు మాత్రం చేస్తున్నారు. తమ్ముడు పవన్ నాతో కలిస్తే ముఖ్యమంత్రిని చేస్తా. బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించాలి.’’ అని కేఏ పాల్ సూచించారు.