మందకృష్ణకు కేఏ పాల్ బంపర్ ఆఫర్
ABN , First Publish Date - 2022-05-18T02:28:59+05:30 IST
విద్యావంతులు తన పార్టీలో చేరాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిలుపునిచ్చారు. ప్రస్తుత పార్టీలన్నీ భ్రష్టుపట్టిపోయాయన్నారు...
హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. మందకృష్ణ తనతో కలిసి పని చేస్తే మంత్రిని చేస్తానన్నారు. ఏళ్లుగా పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ ఏం సాధించారని కేఏ పాల్ ప్రశ్నించారు. విద్యావంతులు తన పార్టీలో చేరాలని... ప్రస్తుత పార్టీలన్నీ భ్రష్టుపట్టిపోయాయన్నారు. తనకు 2012లోనే ఎంపీ సీటు, మంత్రి పదవి ఆఫర్ వచ్చినా తిరస్కరించానని చెప్పారు. అమిత్షా స్వయంగా మంత్రి పదవి ఇస్తానని తనకు చెప్పినట్లు కేఏ పాల్ తెలిపారు.