పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు..

ABN , First Publish Date - 2021-01-24T03:18:28+05:30 IST

రానున్న పంచాయతీ ఎన్నికల్లో, తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్ప

పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు..


పొదలకూరు, జనవరి 23 : రానున్న పంచాయతీ ఎన్నికల్లో, తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని టీడీపీ సీనియర్‌ నాయకుడు భాస్కర్‌రెడి ్డ నివాసంలో తెలుగు యువత ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  18 నెలలుగా వైసీపీ అరాచకపాలనపై ప్రజలు విసుగుచెందారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నియోజకవర్గంలో టీడీపీ పార్టీ క్యాడర్‌ బలంగా ఉందన్నారు.  కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంటు పరిశీలకుడు రామారావు, టీడీపీ నాయకులు పి.మస్తాన్‌బాబు, మల్లికార్జుననాయుడు, సుబ్బానాయుడు, బక్కయ్యనాయుడు, వెంకటరత్నం నాయుడు, భాస్కర్‌రెడ్డి, పుల్లయ్యగౌడ్‌, కె.సురేష్‌,  తదితరులు పాల్గొన్నారు.





---------------




Updated Date - 2021-01-24T03:18:28+05:30 IST