ప్రజాసమస్యలు పరిష్కరించాలని ఆందోళన

ABN , First Publish Date - 2022-07-01T02:48:28+05:30 IST

ప్రజాసమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కావలి వెంగళరావునగర్‌ సచివాలయం వద్ద గు

ప్రజాసమస్యలు పరిష్కరించాలని ఆందోళన
సచివాలయం వద్ద ఆందోళన చేస్తున్న సీపీఎం నేతలు, ప్రజలు

కావలి, జూన్‌ 30 : ప్రజాసమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కావలి వెంగళరావునగర్‌ సచివాలయం వద్ద గురువారం ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి పీ. పెంచలయ్య మాట్లాడుతూ వెంగళరావునగర్‌ ప్రాంతంలో  పదిరోజులపాటు  తాము నిర్వహించిన ఇంటింటి కార్యక్రమంలో ప్రజలు పడే  ఇబ్బందులను తెలుసుకున్నామన్నారు. ఈ ప్రాంతంలో నీటిసమస్య, మురుగు కాలువల సమస్య, రోడ్లపై చెత్తాచెదారం, పందులు బెడద తదితర సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. వీటి పరిష్కారం కోసం ప్రజా ఆందోళన ద్వారా అధికారుల దృష్టికి తీసుకు వస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు వై. కృష్ణమోహన్‌, జీ. మధుసూదనరావు, చెన్నయ్య, వెంకటేశ్వర్లు, పీ. కృష్ణయ్య, అమరకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T02:48:28+05:30 IST