ప్రజ్ఞా సింగ్ ఠాకూర్కు అస్వస్థత
ABN , First Publish Date - 2021-03-07T00:06:22+05:30 IST
బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అస్వస్థతతో బాధపడుతున్నారు
భోపాల్ : బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అస్వస్థతతో బాధపడుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బందిపడుతుండటంతో ఆమెను ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించినట్లు ఆమె కార్యాలయం శనివారం తెలిపింది.
ఆమె ఇటువంటి సమస్యతో బాధపడటం ఓ నెల వ్యవధిలో ఇది రెండోసారి. ఫిబ్రవరి 19న కూడా ఆమెకు శ్వాస తీసుకోవడంలో సమస్య ఎదురవడంతో ఢిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్)కు తరలించి, చికిత్స చేయించారు. 2020 డిసెంబరులో కోవిడ్ లక్షణాలతో ఆమె ఎయిమ్స్లో చేరిన సంగతి తెలిసిందే.
2008 మాలెగావ్ పేలుళ్ళ కేసులో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ నిందితురాలు. ఆమెకు 2017లో బెయిలు మంజూరైంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆమె మధ్య ప్రదేశ్లోని భోపాల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ను ఓడించారు. ఆయనపై 3.6 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.