ప్రగతి భవన్ ముట్టడి కేసులో కేసీఆర్ మనవడు

ABN , First Publish Date - 2020-08-13T17:56:06+05:30 IST

ప్రగతి భవన్ ముట్టడి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

ప్రగతి భవన్ ముట్టడి కేసులో కేసీఆర్ మనవడు

హైదరాబాద్: ప్రగతి భవన్ ముట్టడి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రగతి భవన్ ముట్టడించిన వారిలో కేసీఆర్ మనవడు రితేష్ ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో రితేష్‌‌ను పోలీసులు ఎఫ్ఐఆర్‌లో ఏ5గా చేర్చుతూ... రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వంపై రితేష్ తల్లి.. కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.


పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ప్రగతి భవన్‌ను ముట్టడించడం ఉద్రిక్తతకు దారి తీసింది. బుధవారం ఉదయం పీపీఈ కిట్లు ధరించి ఓ డీసీఎంలో అక్కడికి చేరుకున్న విద్యార్థి సంఘం నేతలు, కార్యకర్తలు... ఒక్క సారిగా ఆందోళన చేపట్టారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఓ విద్యార్థి ఇనుప గ్రిల్స్‌ ఎక్కి లోపలకు దిగాడు. అప్పటికే అప్రమత్తమైన పోలీసులు ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మిగతా నాయకులందరూ అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. వారందరినీ లాగి పడేశారు. వ్యాన్‌లో ఎక్కించి గోషామహల్‌ పీఎ్‌సకు తరలించారు. 

Updated Date - 2020-08-13T17:56:06+05:30 IST