ప్రగతి భవన్ ముట్టడికి గొల్ల, కురుమ సంఘాల యత్నం

ABN , First Publish Date - 2020-09-21T19:25:23+05:30 IST

హైదరాబాద్: గొర్రెలు మేకల పెంపకం దార్ల సంఘం (GMPS) ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడికి గొల్ల, కురుమ సంఘం నాయకులు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు.

ప్రగతి భవన్ ముట్టడికి గొల్ల, కురుమ సంఘాల యత్నం

హైదరాబాద్: గొర్రెలు మేకల పెంపకం దార్ల సంఘం (GMPS) ఆధ్వర్యంలో గొల్ల కురుమ సంఘం నేతలు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు నిరసన కారులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా గొల్ల కురుమ సంఘం నాయకులు ఉడుత రవీందర్  మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో గొల్ల కురుమలను కోటీశ్వరులను చేస్తానని అప్పులపాలు చేసిందని విమర్శించారు. గొర్రెలు వస్తాయనే ఆశతో ️28 వేల మంది కురుమ, యాదవులు పుస్తెలు తాకట్టుపెట్టి మరీ బ్యాంకు డీడీలు కట్టి రెండేళ్లుగా వేచి చూస్తున్నారని విమర్శించారు.

Updated Date - 2020-09-21T19:25:23+05:30 IST