China లో భారత్‌ రాయబారిగా ప్రదీప్ కుమార్‌

ABN , First Publish Date - 2021-12-21T13:16:03+05:30 IST

సీనియర్‌ దౌత్యవేత్త ప్రదీప్ కుమార్‌ రావత్‌ చైనాలో భారత్‌ తదుపరి రాయబారిగా సోమవారం నియమితులయ్యారు.

China లో భారత్‌ రాయబారిగా ప్రదీప్ కుమార్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 20 : సీనియర్‌ దౌత్యవేత్త ప్రదీప్ కుమార్‌ రావత్‌ చైనాలో భారత్‌ తదుపరి రాయబారిగా సోమవారం నియమితులయ్యారు. ప్రస్తుతం చైనా రాయబారిగా ఉన్న విక్రమ్‌ మిస్రి నుంచి త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) 1990 బ్యాచ్‌కు చెందిన రావత్‌.. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో భారత రాయబారిగా ఉన్నారు. చైనా దౌత్యవేత్తలతో చర్చలు జరిపేటప్పుడు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారనే పేరు ఆయనకు ఉంది.  

Updated Date - 2021-12-21T13:16:03+05:30 IST