సామాజిక దూరం పాటించండి
ABN , First Publish Date - 2020-03-29T11:34:23+05:30 IST
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని, సామాజిక దూరం పాటించాలని
ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్కుమార్
రణస్థలం/లావేరు, మార్చి 28 : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని, సామాజిక దూరం పాటించాలని ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ తెలిపారు. శనివారం ఆయన రణస్థలం మండలంలోని సీతంవలస, లావేరు మండలంలోని వెంకటాపురంలలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన కరోనాపై ప్రజలకు అవగహన కల్పించారు. ఏప్రిల్ 14 వరకూ బయటకు రాకుండా ఉండాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేయించాలని సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు బొంతు ఎల్లంన్నాయుడు, లుకలాపు అనీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.