సామాజిక దూరం పాటించండి

ABN , First Publish Date - 2020-03-29T11:34:23+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని, సామాజిక దూరం పాటించాలని

సామాజిక దూరం పాటించండి

ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌


రణస్థలం/లావేరు, మార్చి 28 :  కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని,  సామాజిక దూరం పాటించాలని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ తెలిపారు. శనివారం ఆయన రణస్థలం మండలంలోని సీతంవలస, లావేరు మండలంలోని వెంకటాపురంలలో పర్యటించారు.


ఈ సందర్భంగా ఆయన కరోనాపై ప్రజలకు అవగహన కల్పించారు.  ఏప్రిల్‌ 14 వరకూ బయటకు రాకుండా ఉండాలన్నారు.  గ్రామాల్లో పారిశుధ్య పనులు చేయించాలని సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు.  కార్యక్రమంలో వైసీపీ నాయకులు బొంతు ఎల్లంన్నాయుడు, లుకలాపు అనీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-29T11:34:23+05:30 IST