మంత్రి బాలినేనితో విద్యుత్ ఉద్యోగుల చర్చలు విఫలం

ABN , First Publish Date - 2020-10-28T22:38:02+05:30 IST

విద్యుత్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి బాలినేని శ్రీనివాస్ చర్చలు ముగిశాయి. సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని ఉద్యోగ సంఘ ప్రతినిధులకు మంత్రి హామీ ఇచ్చారు. విద్యుత్ ఉద్యోగుల అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల

మంత్రి బాలినేనితో విద్యుత్ ఉద్యోగుల చర్చలు విఫలం

అమరావతి: విద్యుత్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి బాలినేని శ్రీనివాస్ చర్చలు ముగిశాయి. సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని ఉద్యోగ సంఘ ప్రతినిధులకు మంత్రి హామీ ఇచ్చారు. విద్యుత్ ఉద్యోగుల అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల ఆందోళనపై ప్రభుత్వంతో నాలుగు గంటల పాటు చర్చలు జరిగాయి. సమావేశం అనంతరం విద్యుత్ ఉద్యోగుల సంఘాల జేఏసీ నేతలు మాట్లాడారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించలేదన్నారు. తమ డిమాండ్లపై రాతపూర్వకంగా ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి రాతపూర్వకంగా హామీ ఇచ్చే వరకూ ఆందోళన, సమ్మె నోటీసు యథాతథంగా కొనసాగుతుందని వెల్లడించారు.

Updated Date - 2020-10-28T22:38:02+05:30 IST