పవర్ కోటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు
ABN , First Publish Date - 2020-02-20T09:17:41+05:30 IST
ఎస్పీడీసీఎల్లో ఒకే కాంట్రాక్టర్కు రూ.30కోట్ల విలువ చేసే పనులు అప్పగించారంటూ ఫేస్బుక్లో పోస్టు చేసిన ఏడీఈ డి.కోటేశ్వరరావు అలియాస్
- అవినీతిపై ఫేస్బుక్లో పోస్టింగే కారణం
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): ఎస్పీడీసీఎల్లో ఒకే కాంట్రాక్టర్కు రూ.30కోట్ల విలువ చేసే పనులు అప్పగించారంటూ ఫేస్బుక్లో పోస్టు చేసిన ఏడీఈ డి.కోటేశ్వరరావు అలియాస్ పవర్ కోటేశ్వరరావుపై యాజమాన్యం కన్నెర్ర చేసింది. బహిరంగంగా సంస్థ అధికారులపై విమర్శలు చేసినందుకు క్రమశిక్షణ చర్యల కింద ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. విద్యుత్తు సంస్థల్లో భారీ కుంభకోణమంటూ ఈనెల 4న కోటేశ్వరరావు పోస్ట్ చేసిన వీడియో ప్రకంపనలు సృష్టించింది. ఈ విషయమై ఆయన స్పందిస్తూ...‘‘నేను నష్టపోయినా ఫర్వాలేదు. విద్యుత్తు సంస్థను కాపాడటమే నా లక్ష్యం’’ అని పేర్కొన్నారు.