ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ
ABN , First Publish Date - 2021-10-23T02:42:24+05:30 IST
కాంట్రాక్టర్ దగ్గరి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు
విశాఖ: కాంట్రాక్టర్ దగ్గరి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు విద్యుత్ ఏఈ దొరికిపోయాడు. రమణ అనే లేబర్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి పెండింగ్లో ఉన్న బిల్లులు నిమిత్తం ఎపీఈపీడీసీఎల్ ఏఈ 2 లక్షలు డిమాండ్ చేసాడు. దీంతో ఏసీబీ అధికారులను కాంట్రాక్టర్ సంప్రదించాడు. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్లో కాంట్రాక్టర్ నుంచి రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా ఏఈని రెడ్ హేండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.