PV Sindhuకు అభినందనల వెల్లువ
ABN , First Publish Date - 2021-08-02T01:30:05+05:30 IST
టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో భారత్కు మరో పతకాన్ని అందించిన తెలుగుతేజం పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో భారత్కు మరో పతకాన్ని అందించిన తెలుగుతేజం పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, కేంద్రమంత్రలు రాజ్నాథ్ సింగ్, ధర్మేంధ్ర ప్రదాన్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సహా మరెందరో సింధుకు అభినందనలు తెలిపారు. దేశానికి పతకం అందించి గర్వకారణంగా నిలిచావంటూ కొనియాడారు. టోక్యో ఒలింపిక్స్లో పతకం సాధించిన సింధు ఈ నెల 3న ఢిల్లీకి రానుంది. ఆమెకు స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులతోపాటు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు వెళ్లనున్నారు.