పీవీపీ అలియాస్ పొట్లూరి వరప్రసాద్పై కేసు నమోదు
ABN , First Publish Date - 2022-01-19T02:27:09+05:30 IST
పీవీపీ అలియాస్ పొట్లూరి వరప్రసాద్పై మరో కేసు నమోదు చేశారు. తమ ఇంటి గోడను పీవీపీ తన అనుచరులతో కూల్చివేయించారంటూ..
హైదరాబాద్: పీవీపీ అలియాస్ పొట్లూరి వరప్రసాద్పై మరో కేసు నమోదు చేశారు. తమ ఇంటి గోడను పీవీపీ తన అనుచరులతో కూల్చివేయించారంటూ.. బంజారాహిల్స్ పీఎస్లో డీకే అరుణ కుమార్తె శ్రుతిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో పీవీపీ అనుచరుడు బాలాజీతో పాటు మరికొందరిపై IPC 447,427,506,509 r/w34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పీవీపీ అనుచరులను పంపి తమపై వేధింపులకు దిగుతున్నాడని, తమ కమ్యూనిటీలోకి అక్రమంగా ప్రవేశించి కాంపాండ్ వాల్ను డ్రిల్లింగ్ మిషిన్లతో కూల్చారని, గోడలపై ఉన్న రేకులను కూడా తొలగించారని శ్రుతి రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.