పవన్ పిలుపుతో అధికార యంత్రాంగం కదిలింది: జనసేన నేత

ABN , First Publish Date - 2021-10-02T21:46:02+05:30 IST

జనసేన శ్రమదానం ద్వారా గోతులు పడిన రోడ్లకు మరమత్తులు చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని జనసేన నేత పోతిన వెంకట మహేష్ అన్నారు.

పవన్ పిలుపుతో అధికార యంత్రాంగం కదిలింది: జనసేన నేత

విజయవాడ: జనసేన శ్రమదానం ద్వారా గోతులు పడిన రోడ్లకు మరమత్తులు చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని జనసేన నేత పోతిన వెంకట మహేష్ అన్నారు. తమ పార్టీ నాయకులను హౌస్ అరెస్టులు చేయడం సమంజసమా? అని ప్రశ్నించారు. అమ్మ పెట్టదు.. అడుక్కుతిన నీయదు అన్న విధంగా ప్రభుత్వం తీరు ఉందని మండిపడ్డారు. పోలీసు శాఖ కూడా నిబంధనలు కు విరుద్ధంగా పని చేయడం పద్దతి కాదని చెప్పారు. పవన్ పిలుపుతో అధికార యంత్రాంగం కదిలిందన్నారు. గతంలో సిఎం వస్తే రోడ్లు వేసేవారని, నేడు పవన్ పర్యటిస్తే రోడ్లు వేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్పారు. 



Updated Date - 2021-10-02T21:46:02+05:30 IST