మంత్రి వెల్లంపల్లి ఇంటి వద్ద నిరసనకు పోతిన మహేష్ పిలుపు
ABN , First Publish Date - 2020-09-19T15:59:04+05:30 IST
విజయవాడ: దుర్గమ్మ వెండి రథంలోని సింహాలు అదృశ్యం ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఈవో రాజీనామా చెయ్యాలని..
విజయవాడ: దుర్గమ్మ వెండి రథంలోని సింహాలు అదృశ్యం ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఈవో రాజీనామా చెయ్యాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు. రాజీనామా చెయ్యని పక్షంలో 20వ తేదీన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి వద్ద నిరసనకు పిలుపునిచ్చారు. ముందస్తు జాగ్రత్తగా పోతిన మహేష్ ఇంటి వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. జనసేన కార్యాలయం చేరకుండా ఎక్కడికక్కడ జనసేన కార్యకర్తలు, నేతలను అడ్డుకుంటున్నారు. పశ్చిమ జనసేన కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.