సింహాల మాయంపై విచారణను పక్కదోవ పట్టిస్తున్నారు: పోతిన మహేష్

ABN , First Publish Date - 2020-09-19T17:15:33+05:30 IST

విజయవాడ: దుర్గగుడి వెండి రథంలోని మూడు సింహాల మాయంపై ఈవో, చైర్మన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సింహాల మాయంపై విచారణను పక్కదోవ పట్టిస్తున్నారు: పోతిన మహేష్

విజయవాడ: దుర్గగుడి వెండి రథంలోని మూడు సింహాల మాయంపై ఈవో, చైర్మన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రథంలోని మూడు సింహాల మాయంపై విచారణను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. చనిపోయిన దుర్గారావు అనే వ్యక్తి మీద తోసేసే ప్రయత్నం చేస్తున్నారని.. ఆ కుట్రను తిప్పికొడతామన్నారు. రథంలోని మూడు సింహాల మాయంపై అనెక అనుమానాలు తలెత్తుతున్నాయని పోతిన మహేష్ పేర్కొన్నారు. ఈవో సురేష్ బాబు నుంచే విచారణ ప్రారంభించాలన్నారు. ఈవో సురేష్ బాబు మూడు సింహాలను తీసుకెళ్ళి మంత్రి వెలంపల్లికి ఇచ్చారని ప్రచారం జరుగుతోందన్నారు. వెండి సింహాలను పూజిస్తే మంచి జరుగుతుందని వెలంపల్లి వాళ్ళ ఇంట్లో తాంత్రిక పూజలు చేస్తున్నారని పేర్కొన్నారు. 


మంత్రి, ఈవోపై చర్యకు తీసుకునేంత వరకూ తమ నిరసనలు కొనసాగిస్తూనే ఉంటామని పోతిన మహేష్ తెలిపారు. 


Updated Date - 2020-09-19T17:15:33+05:30 IST