వలంటీర్ల సత్కారాలు వాయిదా

ABN , First Publish Date - 2021-04-13T05:59:09+05:30 IST

ఉగాది సందర్భంగా గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రభుత్వం తరపున పంపిణీ చేయాల్సిన పురస్కార కార్యక్రమాలు జిల్లాలో వాయిదా పడ్డాయి.

వలంటీర్ల సత్కారాలు వాయిదా

కలికిరి, ఏప్రిల్‌ 12: ఉగాది సందర్భంగా గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రభుత్వం తరపున పంపిణీ చేయాల్సిన పురస్కార కార్యక్రమాలు జిల్లాలో వాయిదా పడ్డాయి. రాష్ట్రమంతా సోమవారం ప్రారంభమైన ఈ కార్యక్రమాలు తిరుపతి ఉప ఎన్నిక దృష్ట్యా ఎన్నికల కమిషను అనుమతించకపోడంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వాయిదా వేశారు. తిరిగి మే నెల 4 తరువాత ఎంపికూ వలంటీర్లకు పురస్కారాలు అందజేస్తారు. రోజుకో నియోజకవర్గం వంతున 14 రోజులపాటు జిల్లాలో ఈ సత్కార సమావేశాలు జరుపుతారు. పురస్కారాలకు అర్హులైన వలంటీర్ల జాబితా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 

Updated Date - 2021-04-13T05:59:09+05:30 IST