‘నాడు - నేడు పనులు వాయిదా వేయాలి’
ABN , First Publish Date - 2021-05-06T05:42:13+05:30 IST
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నాడు - నేడు రెండో విడత పనులు వాయిదా వేయాలని పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణారావు డిమాండ్ చేశారు.
నంద్యాల (ఎడ్యుకేషన్), మే 5: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నాడు - నేడు రెండో విడత పనులు వాయిదా వేయాలని పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణారావు డిమాండ్ చేశారు. బుధవారం నంద్యాలలోని పీఆర్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణారావు మాట్లాడారు. విద్యా కానుక కిట్లు పాఠశాలలో నిల్వ చేయడానికి అనేక పాఠశాలల్లో నైట్ వాచ్మెన్లు లేరని, వాటిని కాంప్లెక్స్లకు చేర్చడానికి రవాణా సౌకర్యాలు లేవని అన్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత కిట్లు సరఫరా చేయాలని, అప్పుడు నాడు-నేడు పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో విజయరావు, నరసింహులు, సుమయోన్, రఘు, సుభాన్, జగదీష్, శంకరయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.