ఇంగ్లండ్‌తో సిరీస్‌ వాయిదా?

ABN , First Publish Date - 2020-07-16T09:21:15+05:30 IST

ఇంగ్లండ్‌తో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌ వాయిదా పడే సూచనలున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం ఈ సెప్టెంబరులో మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం ఇంగ్లండ్‌ జట్టు.. భారత్‌ ..

ఇంగ్లండ్‌తో సిరీస్‌ వాయిదా?

ఇంగ్లండ్‌తో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌ వాయిదా పడే సూచనలున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం ఈ సెప్టెంబరులో మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం ఇంగ్లండ్‌ జట్టు.. భారత్‌ రావాల్సి ఉంది. అయితే, కొవిడ్‌ మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా భారత్‌లో ఇంగ్లండ్‌ జట్టు పర్యటించే అవకాశాల్లేవని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. అలాగే, ఆగస్టులో భారత్‌లో న్యూజిలాండ్‌-ఎ జట్టు పర్యటన కూడా  జరిగే అవకాశాల్లేవని తెలుస్తోంది. బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం తర్వాత వీటిపై బోర్డు నుంచి అధికారిక ప్రకటన వెలువడొచ్చని ఆ అధికారి పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-16T09:21:15+05:30 IST