దుర్గగుడి మాజీ ఈవో సురేష్‌బాబుకు పోస్టింగ్‌

ABN , First Publish Date - 2021-05-17T22:55:53+05:30 IST

దుర్గగుడి మాజీ ఈవో సురేష్‌బాబుకు ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. రాజమండ్రి దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్‌గా సురేష్‌బాబుని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దుర్గగుడి మాజీ ఈవో సురేష్‌బాబుకు పోస్టింగ్‌

అమరావతి: దుర్గగుడి మాజీ ఈవో సురేష్‌బాబుకు ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోనుంది. రాజమండ్రి దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్‌గా సురేష్‌బాబుని నియమిస్తూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అవినీతి ఆరోపణలతో సురేష్‌బాబును ప్రభుత్వం తొలగించింది. రాజమండ్రి ఆర్జేసీగా సురేష్‌బాబును ప్రభుత్వం నియమించింది.  ఈ మేరకు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్ రాజమండ్రి ఆర్జేసీ బాధ్యతలను సురేష్‌బాబుకు అప్పగించనున్నారు.

Updated Date - 2021-05-17T22:55:53+05:30 IST