సీఎం ఎంపికకు ముందే నితిన్ పటేల్ పోస్టర్లు..

ABN , First Publish Date - 2021-09-12T20:25:05+05:30 IST

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశమవుతున్న తరుణంలో ఆదివారం ఉదయం..

సీఎం ఎంపికకు ముందే నితిన్ పటేల్ పోస్టర్లు..

గాంధీనగర్: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశమవుతున్న తరుణంలో ఆదివారం ఉదయం గుజరాత్‌లోని పలు చోట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. సీఎం పగ్గాలు ఆయనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ పోస్టర్లు వెలిశాయి. నితిన్ పటేల్‌కే సీఎం పగ్గాలు ఇవ్వనున్నట్టు వార్తలు కూడా రావడంతో మీడియాతో ఆయన మాట్లాడారు. జనాదరణ, అనుభవంతో పాటు అందర్నీ కలుపుకుని వెళ్లే వ్యక్తే సీఎం అవుతారని చెప్పారు. తాను సీఎం అవుతానంటూ మీడియాలో ప్రచారం జరుగుతోందని, నిజానికి బీజేపీ అధిష్ఠానమే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తుందని చెప్పారు.


విజయ్ రూపానీ స్వచ్ఛందంగానే రాజీనామా చేశారని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని అన్నారు. సీఎం ఎవరయితే బాగుంటుందనే విషయమై బీజేపీ సీనియర్ నేతల అభిప్రాయాలను సేకరించేందుకు కేంద్ర పరిశీలకులను పార్టీ అధిష్టానం పంపిందని తెలిపారు. లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని నితిన్ పటేల్ చెప్పారు.

Updated Date - 2021-09-12T20:25:05+05:30 IST